Vangalapudi Anita: సీఎం జగన్‌కు మించిన నటుడు మరొకరు ఉండరు...

ABN , First Publish Date - 2022-09-25T18:09:15+05:30 IST

ఏదైనా విషయం ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ (YCP)లో దొంగల ముఠా పని చేస్తుందని...

Vangalapudi Anita: సీఎం జగన్‌కు మించిన నటుడు మరొకరు ఉండరు...

విశాఖ (Visakha): ఏదైనా విషయం ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ (YCP)లో దొంగల ముఠా పని చేస్తుందని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) విమర్శించారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్ భారతి (Bharathi),  విజయసాయి రెడ్డి (Vijayasaireddy) అల్లుడు ఉన్నారని ప్రచారం జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని కప్పి పుచ్చడానికి, పేర్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు. తాడేపల్లి ఫ్యాలస్, హైదరాబాదులో ఉన్న లోటస్‌పాండ్‌కు ఎందుకు వైఎస్ పేరు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. వైద్య రంగంలో వైఎస్ చేసిన సేవ ఎవరు చేయలేదన్నట్టు జగన్ మాట్లాడారని.. రాజశేఖర్ రెడ్డికి, ఎన్టీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. సీఎం జగన్‌కు మించిన నటుడు మరొకరు ఉండరని అన్నారు. నటనలో ఎస్.వి.రంగారావు కూడా జగన్ దగ్గర దిగదుడుపేనన్నారు.


జగన్మోహన్ రెడ్డికి తండ్రి మీద ప్రేమ ఉంటే తల్లి, చెల్లిని పక్క రాష్ట్రానికి ఎందుకు పంపించారని వంగలపూడి అనిత ప్రశ్నించారు.  పేరు పెట్టుకోవాలనిపిస్తే  సెంట్రల్ జైలుకు జగన్ పేరు పెట్టుకోవచ్చు కదా... దీనిపైన పునరాలోచించాలని కోరుతున్నానన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ, నేతలు తప్పితే ఎవరు ఉండరన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర, చూసి వైసీపీ ఎందుకు భయపడుతోందన్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు రౌండ్ టేబుల్ సమావేశమని ప్రశ్నించారు. ఎప్పుడైనా 3 రాజధానులపై రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి రౌండ్ టేబుల్ సమావేశం ఏంటన్నారు. అమరావతి కట్టడానికి డబ్బులు లేవంటున్నారు.. మూడు రాజధానులు ఎప్పుడు కడతారు.. మూడు రాజధానుల పేరుతో విశాఖలో ఏం చేశారని ప్రశ్నించారు. కబ్జాలు తప్పితే ఏం జరగలేదని వంగలపూడి అని ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-09-25T18:09:15+05:30 IST