చంద్రబాబుపై కక్ష.. మాపై తీర్చుకుంటున్నారు

ABN , First Publish Date - 2022-12-02T04:22:53+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్షను తమపై తీర్చుకుంటోందని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వద్ద మొర పెట్టుకున్నారు.

చంద్రబాబుపై కక్ష.. మాపై తీర్చుకుంటున్నారు

సీపీఐ రామకృష్ణ వద్ద టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల మొర

విజయవాడ రూరల్‌, డిసెంబరు 1: వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్షను తమపై తీర్చుకుంటోందని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వద్ద మొర పెట్టుకున్నారు. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లను సీపీఐ బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా నేతల వద్ద లబ్ధిదారులు తమ గోడు వెలిబుచ్చారు. పరిస్ధితులను గమనిస్తే చంద్రబాబుపై పగను జగన్‌ తమపై తీర్చుకుంటున్నారని అర్థమవుతోందని, ఇది ఎంతవరకు న్యాయమని కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - 2022-12-02T04:22:54+05:30 IST