టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-10T06:27:51+05:30 IST

పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలని డీఈఓ లింగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం సీతయ్యపేట జడ్పీ హైస్కూల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈఓ లింగేశ్వరరెడ్డి


డీఈఓ లింగేశ్వరరెడ్డి

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 9: పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలని డీఈఓ లింగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం సీతయ్యపేట జడ్పీ హైస్కూల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైస్కూల్‌ ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధనలు ద్వారా ఏ గ్రేడ్‌ విద్యార్థులుగా మార్చాలన్నారు. రూ.84 లక్షలతో నిర్మిస్తున్న ఏడు అదనపు భవన నిర్మాణాలను పరిశీలించారు. విద్యార్థులను పలు సబ్జెక్టులకు సంబదించిన ప్రశ్నలు అడిగి సమాధానాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం చంద్రశేఖరరావు, హెచ్‌ఎం జగన్నాథరావు, స్కూల్‌ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ వి.బాబురావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-10T06:27:51+05:30 IST