టెన్త్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ABN , First Publish Date - 2022-09-10T06:27:51+05:30 IST
పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలని డీఈఓ లింగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం సీతయ్యపేట జడ్పీ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డీఈఓ లింగేశ్వరరెడ్డి
బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 9: పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలని డీఈఓ లింగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం సీతయ్యపేట జడ్పీ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైస్కూల్ ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధనలు ద్వారా ఏ గ్రేడ్ విద్యార్థులుగా మార్చాలన్నారు. రూ.84 లక్షలతో నిర్మిస్తున్న ఏడు అదనపు భవన నిర్మాణాలను పరిశీలించారు. విద్యార్థులను పలు సబ్జెక్టులకు సంబదించిన ప్రశ్నలు అడిగి సమాధానాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం చంద్రశేఖరరావు, హెచ్ఎం జగన్నాథరావు, స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వి.బాబురావు పాల్గొన్నారు.