Somu Veerraju : స్టీల్ ప్లాంట్‌ని అదానికి అమ్మేసిన వారిని ప్రశ్నించండి

ABN , First Publish Date - 2022-11-07T12:45:06+05:30 IST

మీడియా (Media)పై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (Somu Veerraju) తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రోజు అబద్దాలు అడేవారు, అవినీతి పరులు చేసే వ్యాఖ్యలపై తమను ఎందుకు ప్రశ్నిస్తారంటూ మండిపడ్డారు

Somu Veerraju : స్టీల్ ప్లాంట్‌ని అదానికి అమ్మేసిన వారిని ప్రశ్నించండి

విశాఖ : మీడియా (Media)పై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (Somu Veerraju) తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రోజు అబద్దాలు అడేవారు, అవినీతి పరులు చేసే వ్యాఖ్యలపై తమను ఎందుకు ప్రశ్నిస్తారంటూ మండిపడ్డారు. ‘రాజధానిపై మాట మార్చి.. మూడు రాజధానులు అంటున్న అబద్ధాలోడికి మేము సమాధానం చెప్పాలా? జగన్‌ (CM Jagan)ని ప్రశ్నించండి. మూడు రాజధానులు అంటున్న వాడిని అడగకుండా..ఒక రాజధాని అంటున్న మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారెందుకు?’ అంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతిపరులు ప్రచారాలు చేస్తే... తాము సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. తామేమైనా ఖాళీగా ఉన్నామా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు ప్యాకేజి తీసుకున్నారన్నారు. స్టీల్ ప్లాంట్‌ (Steel Plant)ని అదాని (Adani)కి అమ్మేసిన వారిని మీరు ప్రశ్నించాలన్నారు. విశాఖలో రైల్వే జోన్‌ (Visakha Railway Zone)తో సహా జరుగుతున్న పలు కార్యక్రమాలకు అందరిని ఆహ్వానిస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Janasena Chief Pawan Kalyan)ని కూడా ఆహ్వానిస్తారా అంటే సమాధానం చెప్పలేదు.

Updated Date - 2022-11-07T12:45:06+05:30 IST

Read more