ముసురేసింది!
ABN , First Publish Date - 2022-07-18T06:29:13+05:30 IST
అల్పపీడన ప్రభావంతో నగరంలో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది.
విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో నగరంలో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకూ చిరుజల్లులు కురిశాయి. చలిగాలులు వీచాయి. మధురవాడ, కొమ్మాది తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. చిరుజల్లులకు రోడ్లపైన గోతుల్లో నీరు నిల్వ ఉండిపోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆదివారం సెలవు కావడంతో బీచ్లో ఆహ్లాదంగా గడిపేందుకు వెళ్లినవారంతా వర్షంలో తడిచి, వెనుదిరగాల్సి వచ్చింది.
జిల్లాలో కొత్తగా 83 మందికి కరోనా
విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం మరో 83 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,93,535కు చేరింది. మరో 69 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. వీటితో మొత్తం రికవరీల సంఖ్య 1,91,857కు చేరింది. కాగా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 587 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో కొవిడ్ బారినపడి 1,155 మంది మృతి చెందారు.