తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-02-28T06:31:35+05:30 IST

మారుమూల కొండలపై ఉన్న గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని అరకు ఎంపీ మాధవి అన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం
నీటి పథకానికి శంకుస్థాపన చేస్తున్న ఎంపీ మాధవి



అరకులోయ ఎంపీ మాధవి 

కొయ్యూరు, ఫిబ్రవరి 27: మారుమూల కొండలపై ఉన్న గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని అరకు ఎంపీ మాధవి అన్నారు. ఆదివారం వెలగలపాలెంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న నీటి పథకానికి ట్యాంకు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏజెన్సీలో  తాగునీటి ఎద్దడి ఉత్పన్నమవ్వకూడదనే ప్రభుత్వం వేసవికి ముందే ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రత్నకుమారి, నేతలు గొడ్డేటి మహేష్‌, పెద్దలు సత్తిబాబు, చిన్ని, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-02-28T06:31:35+05:30 IST