AP News.. విజయసాయిపై చర్యలు తీసుకోవడానికి జగన్కు భయం: ప్రణవ్ గోపాల్
ABN , First Publish Date - 2022-10-14T17:52:09+05:30 IST
ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే వికేంద్రీకరణ పేరిట రాజధాని చిచ్చును సీఎం జగన్ రగిల్చారని...
విశాఖ (Visakha): ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే వికేంద్రీకరణ పేరిట రాజధాని చిచ్చును సీఎం జగన్ (CM Jagan) రగిల్చారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) అన్నారు. A2 విజయసాయిరెడ్డి (Vijayasaireddy) విశాఖను ఏ విధంగా దోచుకున్నది వైసీపీ (YCP) విశాఖ ఎంపీ సాక్షాలతో సహా బయటపెట్టారన్నారు. విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి జగన్ భయపడుతున్నారని విమర్శించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భూ బాగోతంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర వనరుల ఆర్ధిక దోపిడీపై విశాఖ గర్జనను నిర్వహించాలన్నారు. వైసీపీ నేతల భూదందాలు రోజుకొకటి బయటపడుతున్నా.. జగన్ రెడ్డి నోరుమెదపరా? అని ప్రశ్నించారు. విశాఖ భూ దందాలో జగన్ రెడ్డికి కూడా వాటా ఉన్నందువల్లనే ఆయన చర్యలు తీసుకోవట్లేదని ప్రణవ్ గోపాల్ విమర్శించారు.