Ushasree Charan: శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్
ABN , First Publish Date - 2022-07-27T15:47:05+05:30 IST
స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ బుధవారం ఉదయం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు.
విశాఖపట్నం: స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్(Ushasree charan) బుధవారం ఉదయం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్(Jagan) పాలనలో అందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రార్ధించినట్లు తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు జగన్ పెద్ద పీట వేశారని మంత్రి ఉషశ్రీ అన్నారు. మరోవైపు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఉషశ్రీ చరణ్కు అంగన్వాడి వర్కర్స్ వినతి పత్రం అందించారు.