AP News: మావోయిస్టు అమరవీరుల స్థూపాల వద్ద జాతీయ జెండాల ప్రదర్శన
ABN , First Publish Date - 2022-08-16T01:24:03+05:30 IST
సీపీఐ మావోయిస్టు అమరవీరుల స్థూపాల వద్ద సోమవారం ఆదివాసీలు జాతీయ జెండాలను ప్రదర్శించారు.
చింతపల్లి: సీపీఐ మావోయిస్టు అమరవీరుల స్థూపాల వద్ద సోమవారం ఆదివాసీలు జాతీయ జెండాలను ప్రదర్శించారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం నాడు బ్లాక్ డేగా పాటించాలని, నల్ల జెండాలను ఎగురవేయాలని గిరిజనులకు మావోయిస్టులు పిలుపునిస్తుంటారు. ఆగస్టు 15న ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో నల్ల జెండాలను ఎగురవేసి మావోయిస్టులు నిరసన వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇటీవల పోలీసుల గాలింపు చర్యలు మమ్మరం కావడంతో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆదివాసీలు బ్లాక్డేకు వ్యతిరేకంగా చింతపల్లి మండలం బలపం, గూడెంకొత్తవీధి మండలం కుంకుంపూడిల్లో గల సీపీఐ మావోయిస్టుల అమరవీరుల స్థూపాల వద్ద జాతీయ జెండాలను ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.