విమ్స్‌లో కొవాక్సిన్‌ డ్రాప్స్‌

ABN , First Publish Date - 2022-04-24T05:51:55+05:30 IST

కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ముక్కుద్వారా వేసే కొవాక్సిన్‌ డ్రాప్స్‌ కార్యక్రమాన్ని (నాసల్‌ ఇంట్రామస్కులర్‌ వ్యాక్సిన్‌) మూడో దశ ట్రైల్‌ను రాష్ట్రంలో తొలిసారి విమ్స్‌లో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించా రు.

విమ్స్‌లో కొవాక్సిన్‌ డ్రాప్స్‌
ట్రయిల్‌ రన్‌ ప్రారంభిస్తున్న డైరెక్టర్‌ రాంబాబు

ఔత్సాహికులకు వేసి ట్రయిల్‌ రన్‌ ప్రారంభించి డైరెక్టర్‌ రాంబాబు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23: కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ముక్కుద్వారా వేసే కొవాక్సిన్‌ డ్రాప్స్‌ కార్యక్రమాన్ని (నాసల్‌ ఇంట్రామస్కులర్‌ వ్యాక్సిన్‌) మూడో దశ ట్రైల్‌ను రాష్ట్రంలో తొలిసారి విమ్స్‌లో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించా రు. విమ్స్‌ డైరెక్టర్‌ కె.రాంబాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ సాధారణ వ్యాక్సినేషన్‌తో పోల్చుకుంటే ఈ నాసిల్‌ ఇంట్రామస్క్‌లర్‌ వ్యాక్సిన్‌ మెరుగైన ఫలితాలను ఇస్తుందని తెలిపారు. ఈ పరిశోధనలకు ఇప్పటి వరకు 39 మంది వలంటీర్లు ముందుకు వచ్చారని, తొలిరోజు నలుగురు వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపారు.


దేశవ్యాప్తంగా మూడో దశ ట్రైల్‌ 3,160 మందిపై జరుగుతోందని తెలిపారు. మొదటి రెండు దశలు మెరుగైన ఫలి తాలు ఇచ్చాయని, వ్యాక్సినేషన్‌ చేసిన వారిలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవ్వడంతోపాటు ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవన్నారు. డ్రాప్స్‌ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలనుకునే వారు 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, ఇంతకు ముందు వ్యాక్సిన్‌ తీసుకోని వారై ఉండాలని తెలిపారు. ఔత్సాహి కులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఐదు నెలలపాటు ట్రైల్‌ కొనసాగిన తర్వాత నివేదిక అందిస్తామని చెప్పారు. ఈ ట్రైల్స్‌ ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్‌ రాంబాబు, సహాయ పరిశోధకుడిగా విజయకుమార్‌, సభ్యులుగా డాక్టర్‌ ఊర్మిల, డాక్టర్‌ సహీనా వ్యవహరిస్తున్నారు.  

Updated Date - 2022-04-24T05:51:55+05:30 IST