ఎమ్మెల్యేకు లేటరైట్పై ఉన్న శ్రద్ధ గిరిజనుల సమస్యలపై లేదు
ABN , First Publish Date - 2022-12-10T01:09:54+05:30 IST
నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్కు లేటరైట్పై ఉన్న శ్రద్ధ గిరిజనుల సమస్యలపై లేదని జనసేన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి రాజాన వీరసూర్యచంద్ర అన్నారు.
నాతవరం, డిసెంబరు 9: నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్కు లేటరైట్పై ఉన్న శ్రద్ధ గిరిజనుల సమస్యలపై లేదని జనసేన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి రాజాన వీరసూర్యచంద్ర అన్నారు. శుక్రవారం ఆయన సుందరకోట, ఽకొండధర్మవరం గ్రామాల్లో ఆయన పర్యటించి, అక్కడ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ కొండధర్మవరంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు రామాలయంలో చదువులు సాగిస్తున్నారని తెలిపారు. అలాగే 40 మంది విద్యార్థులు ఉన్న సందరకోటలో పాఠశాల భవనం లేక విద్యార్థులు పరాయిపంచన చదువుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ, భవానీ, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.