ఎమ్మెల్యేకు లేటరైట్‌పై ఉన్న శ్రద్ధ గిరిజనుల సమస్యలపై లేదు

ABN , First Publish Date - 2022-12-10T01:09:54+05:30 IST

నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌కు లేటరైట్‌పై ఉన్న శ్రద్ధ గిరిజనుల సమస్యలపై లేదని జనసేన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర అన్నారు.

ఎమ్మెల్యేకు లేటరైట్‌పై ఉన్న శ్రద్ధ గిరిజనుల సమస్యలపై లేదు
ధర్మవరంలో గిరిజనుల సమస్యలను అడుగుతున్న సూర్యచంద్ర

నాతవరం, డిసెంబరు 9: నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌కు లేటరైట్‌పై ఉన్న శ్రద్ధ గిరిజనుల సమస్యలపై లేదని జనసేన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర అన్నారు. శుక్రవారం ఆయన సుందరకోట, ఽకొండధర్మవరం గ్రామాల్లో ఆయన పర్యటించి, అక్కడ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ కొండధర్మవరంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు రామాలయంలో చదువులు సాగిస్తున్నారని తెలిపారు. అలాగే 40 మంది విద్యార్థులు ఉన్న సందరకోటలో పాఠశాల భవనం లేక విద్యార్థులు పరాయిపంచన చదువుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ, భవానీ, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:09:56+05:30 IST