అట్రాసిటీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ వేసిన 24గంటల్లో దోషులను అరెస్ట్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T06:14:59+05:30 IST

అట్రాసిటీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన 24గంటల్లో దోషులను అరెస్ట్‌ చేయాలని ఏపీ రెల్లి హక్కుల రిజర్వేషన్‌ పోరాటసమితి జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి పాపారావు డిమాండ్‌ చేశారు.

అట్రాసిటీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ వేసిన 24గంటల్లో దోషులను అరెస్ట్‌ చేయాలి
నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతున్న ఏపీ రెల్లి హక్కుల రిజర్వేషన్‌ పోరాటసమితి నాయకులు


 నర్సీపట్నం అర్బన్‌, అక్టోబరు 7: అట్రాసిటీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన 24గంటల్లో దోషులను అరెస్ట్‌ చేయాలని ఏపీ రెల్లి హక్కుల రిజర్వేషన్‌ పోరాటసమితి జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి పాపారావు డిమాండ్‌ చేశారు. నర్సీపట్నంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. దళితులకు రక్షణ కవచం అయిన అట్రాసిటీ చట్టం అమలు చేయడంలో సుప్రీం కోర్టు ఆదేశాలను అధికారులు తుంగలోకి తొక్కుతున్నారన్నారు. ఈ కేసులపై క్షేత్రస్థాయిలో బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ పథకాలకు అంబేడ్కర్‌ పేరుతో అమలు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు దానబోయిన శ్రీను, వడ్డాది దేముడు, ఎర్రంశెట్టి చిన్నప్పనాయుడు, ముత్యాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-08T06:14:59+05:30 IST