ఆకట్టుకున్న కవి సమ్మేళనం
ABN , First Publish Date - 2022-11-19T01:00:33+05:30 IST
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో శుక్రవారం కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు
పాయకరావుపేట, నవంబరు 18 : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో శుక్రవారం కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్రాంత హెచ్ఎం యజ్ఞవల్కశర్మ సమన్వయకర్తగా వ్యవహరించిన సమ్మేళనంలో కవులు పన్నీరు సాయికుమార్, చింతకాయల గిరిబాబు, జమునా కిషోర్, ఎస్.రామకృష్ణ, వెలగా శేఖర్, వై.భీమసేన, ఎన్వీఎస్ ఆచార్యులు, రామ్కుమార్ తదితరులు తమ చక్కని రచనలను వినిపించారు. అనంతరం వీరిని నిర్వాహకులు సత్కరించారు. అదేవిధంగా పలు పాఠశాలల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పాండురంగస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ యాళ్ళ వరహాలు, గుల్లా నాగరాజు, ఎం.ఎస్.సీతారామమూర్తి, యోగా గురువు ప్రసాద్, అచ్యుతరావు, గ్రంథాలయ ఇన్చార్జి వామాల లక్ష్మణరావు, కమిటీ సభ్యులు దాడి కృష్ణారావు, తాళారావు, డి.సత్యవర్మ, సీహెచ్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.