అధికారుల ఆదేశాలు బేఖాతరు

ABN , First Publish Date - 2022-03-16T05:56:53+05:30 IST

స్థానిక రాజుగారిబీడులో పుంతరోడ్డు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించే వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని పంచాయతీ అధికారులు జారీ చేసిన హెచ్చరికలను పలువురు బేఖాతరు చేస్తు న్నారు.

అధికారుల ఆదేశాలు బేఖాతరు
పుంతరోడ్డు పక్కన జరుగుతున్న ఇంటి నిర్మాణం

పుంతరోడ్డును ఆనుకుని ఇంటి నిర్మాణం


పాయకరావుపేట, మార్చి 15: స్థానిక రాజుగారిబీడులో పుంతరోడ్డు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించే వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని పంచాయతీ అధికారులు జారీ చేసిన హెచ్చరికలను పలువురు బేఖాతరు చేస్తు న్నారు. యథావిధిగా రోడ్డును ఆనుకుని ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. పాయకరావుపేట పట్టణంలోని రాజుగారి బీడులో ఆక్రమణలపాలైన సందప్ప చెరువు పుంతరోడ్డు సర్వే పూర్తయి, హద్దులు నిర్ణయించేంత వరకు పనులు నిలిపివేయాలని గతేడాది నవంబరులో పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. దీంతో పలువురు ఇళ్ల నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇటీవల పుంతరోడ్డు సర్వే పూర్తిచేసిన రెవెన్యూ అధికారులు రోడ్డుకి ఇరువైపులా పలుచోట్ల ఆక్రమణలు జరిగినట్టు గుర్తించారు. సర్వే నివేదిక ఆధారంగా పుంతరోడ్డుకి ఇరువైపులా సరిహద్దురాళ్లను ఏర్పాటుచేసి ఆక్రమణలు తొలగించేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలి. అంతవరకు పుంతరోడ్డును ఆనుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కానీ మెయిన్‌ జంక్షన్‌లో ఇంటి నిర్మాణం జరుగుతోంది. పైగా ఈ ఇంటి నిర్మాణానికి పంచాయతీ ప్లాన్‌ అప్రూవల్‌ లేదని తెలిసింది. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఎం.సత్యప్రసాద్‌ని వివరణ కోరగా, వెంటనే సిబ్బందిని పంపి నిర్మాణ పనులు నిలిపివేయిస్తామని తెలిపారు.






Updated Date - 2022-03-16T05:56:53+05:30 IST