వదలని వర్షం

ABN , First Publish Date - 2022-10-08T06:42:19+05:30 IST

నగరంలో ముసురు వాతావరణం కొనసాగుతోంది.

వదలని వర్షం

వదలని వర్షం


విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):


నగరంలో ముసురు వాతావరణం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగు కాల్వలు పొంగడంతో పలుచోట్ల ప్రధాన రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా వర్షాలు కొనసాగుతుండడంతో కొండవాలు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా రానున్న రెండు రోజులు కూడా ఎక్కువచోట్ల వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 



మునిగిన విఘ్నేశ్వర విగ్రహం

భారీ వర్షం పడడంతో అనకాపల్లి జిల్లా చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వర ఆలయం జలమయం అయ్యింది. గర్భగుడిలోకి కూడా నీరు చేరడంతో  విఘ్నేశ్వరుడి విగ్రహం మూడొంతులు నీట మునిగింది. గత ఆదివారం రాత్రి కూడా భారీవర్షం పడడంతో విఘ్నేశ్వరుడి విగ్రహం నీట మునిగింది.

-చోడవరం



Updated Date - 2022-10-08T06:42:19+05:30 IST