Bandaru satyanarayana: పిట్టల దొరలుగా కొత్త మంత్రులు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-26T18:27:57+05:30 IST

కొత్త మంత్రులు పిట్టల దొరలుగా మాట్లాడుతున్నారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు.

Bandaru satyanarayana: పిట్టల దొరలుగా కొత్త మంత్రులు వ్యాఖ్యలు

విశాఖపట్నం: కొత్త మంత్రులు పిట్టల దొరలుగా మాట్లాడుతున్నారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ (Bandaru satyanarana murthi) మూర్తి విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు (Chandrababu) హయాంలో ఏమేమి వచ్చాయో తాము చెప్పామని.. మూడున్నారెళ్లుగా ఏమి తెచ్చారో వైసీపీ నేతలు (YCP Leaders) చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో అధికారులతో సీఎం (CM Jagan) ఇంతవరకు సమావేశం ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.


అమరావతి రైతులను అపహాస్యం చేయవద్దన్నారు. విశాఖకు ఎంత ఇచ్చారో.. పులివెందులకు ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తలుచుకుంటే జగన్(AP CM) అప్పుడు బయటకు వచ్చేవారా?.. పాదయాత్ర చేసేవారా? అని అడిగారు. బహుశా అప్పుడు బొత్స (Botsa satyanarayana) వైసీపీలో లేరని అనుకుంటా? అంటూ యెద్దేవా చేశారు. వోక్స్ వాగన్ పూణేకు ఎందుకు పోయిందో మంత్రి బొత్స (AP Minister) చెప్పాలని బండారు సత్యనారాయణ (Former minister) డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-26T18:27:57+05:30 IST