AP News: డాక్టర్ సుధాకర్ స్మారక సభకు అడుగడుగునా పోలీసుల అడ్డంకి

ABN , First Publish Date - 2022-12-09T09:25:42+05:30 IST

డాక్టర్ సుధాకర్ స్మారక సభకు అడుగడుగునా పోలీసులు అడ్డంకి సృష్టిస్తున్నారు.

AP News: డాక్టర్ సుధాకర్ స్మారక సభకు అడుగడుగునా పోలీసుల అడ్డంకి

విశాఖపట్నం: డాక్టర్ సుధాకర్ స్మారక సభకు అడుగడుగునా పోలీసులు అడ్డంకి సృష్టిస్తున్నారు. విశాఖలో సుధాకర్ పేరిట బహిరంగసభ ఏర్పాటుకు జై భీమ్ భారత్ పార్టీ అధినేత శ్రవణ్‌కుమార్ పిలుపునిచ్చారు. హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నా పోలీసులు అనుమతివ్వని పరిస్థితి. శాంతిభద్రతల కారణంగా అనుమతివ్వలేమంటూ రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీస్ శాఖ తీరుపై శ్రవణ్‌కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది కచ్చితంగా జగన్‌రెడ్డి పిరికితనానికి నిదర్శనమన్నారు. పోలీసులు వైసీపీ గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విశాఖ సీపీ వైసీపీ కండువా వేసుకుంటే మంచిదని యెద్దేవా చేశారు. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎక్కడైతే అనుమతి నిరాకరించారో.. అక్కడే సభ పెడతామని శ్రవణ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-09T09:25:44+05:30 IST