Visakha: కాంగ్రెస్ నేత Chinta Mohan కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-30T17:32:11+05:30 IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Visakha: కాంగ్రెస్ నేత Chinta Mohan కీలక వ్యాఖ్యలు

Visakha: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta Mohan) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ (Ambedkar) పేరు ఒక చిన్న జిల్లాకు కాదని, దక్షిణ భారత దేశానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడం లేదని అన్నారు. వైసీపీ (YCP) మంత్రులది బస్సు యాత్ర కాదని.. తుస్సు యాత్రని ఎద్దేవా చేశారు. ధర్మాన ఊకదంపుడు ఉపన్యాసాలు కుర్చీలే విన్నాయన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థులకు స్కాలర్ షిప్‌ (Scholarship)లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-30T17:32:11+05:30 IST