కేంద్రం ఆమోదంతో టెండర్లలో పాల్గొనవచ్చు

ABN , First Publish Date - 2022-11-23T03:16:15+05:30 IST

కేంద్ర ఇంధనశాఖ ఆమోదం పొందితే మీటర్ల టెండర్లలో పాల్గొనే అవకాశం ఉందని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు వివరణ ఇచ్చారు.

కేంద్రం ఆమోదంతో టెండర్లలో పాల్గొనవచ్చు

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఎపీఎస్పీడీసీఎల్‌ వివరణ

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఇంధనశాఖ ఆమోదం పొందితే మీటర్ల టెండర్లలో పాల్గొనే అవకాశం ఉందని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు వివరణ ఇచ్చారు. ‘‘అస్మదీయులకేనా మీటర్లు’’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. స్మార్ట్‌ మీటర్ల టెండర్ల ప్రక్రియలో స్పెక్ట్రమ్‌ ఆఫ్‌ బిడ్డర్స్‌ను మాత్రమే ఆహ్వానిస్తున్నామనడం సరికాదని చెప్పా రు. కేంద్ర ఇంధనశాఖ నిబంధనల మేరకే టెండరు మార్గదర్శకాలు రూపొందించామన్నారు. కేంద్ర ఇంధనశాఖ ఆర్‌ఈసీ వెబ్‌సైట్‌లో కాంట్రాక్టు సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా గడువు ఉందన్నారు. 29 సంస్థలు ఈఆర్‌సీ ఆమోదం పొందాయని సంతోషరావు వెల్లడించారు. ఎపీఎస్పీడీసీఎల్‌లో కన్జుమర్‌ గ్రీవెన్సెస్‌ రిడ్రెసల్‌ ఫోరం చైర్మన్‌ నియామకం నిబంధన మేరకే జరుగుతుందని సీఎండీ సంతోషరావు వివరించారు. ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన ‘‘మనోడికే ఇచ్చేద్దాం చాన్స్‌’’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయ న స్పందించారు. ఏపీఈఆర్‌సీ ఆదేశాల మేరకే సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌ నియామకం చేపడుతున్నామని వెల్లడించారు. దీనికోసం ఆగస్టు 21న దినపత్రికల్లో ప్రకటన జారీ చేశామన్నారు.

Updated Date - 2022-11-23T03:16:16+05:30 IST