Somuveerraju: ప్రధాని తల్లి మరణం దేశానికి, బీజేపీకి తీరని లోటు
ABN , First Publish Date - 2022-12-30T14:31:17+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మరణం భారతదేశానికి, ప్రధానంగా బీజేపీకికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు.
విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) తల్లి హీరాబెన్ మరణం భారతదేశానికి, ప్రధానంగా బీజేపీకి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (BJP Leader Somuveerraju) అన్నారు. పధాదికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహరావు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొని ముందుగా ప్రధాని మోదీ తల్లి మృత్తి పట్ల సంతాపం తెలిపారు. అనంతరం సోమువీర్రాజు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీపై తల్లి ప్రభావం ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) యువతకు ఇచ్చిన హమీలు అమలు చేయలేదని విమర్శించారు. బీసీలను రాష్ట్రం ప్రభుత్వం ఓటర్లుగా చూస్తోందన్నారు. త్వరలో విశాఖపట్నం, విజయవాడలో బీసీ సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో 13 వేల గ్రామాల్లో పాదయాత్ర చేయనున్నామని ప్రకటించారు. ఏపీలో ఏం అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని ప్రశ్నించారు. జనవరి ఎనిమిదిన ఏపీలో అమిత్ షా పర్యటన ఉందని తెలిపారు. 2024లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళుతున్నాయన్నారు. 2024లో అధికారంలోకి వచ్చే దిశగా యాత్ర చేయబోతున్నామని సోమువీర్రాజు వెల్లడించారు.