బీజేపీ మోసకారి పార్టీ: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2022-11-12T04:42:40+05:30 IST
బీజేపీ మోసకారి పార్టీ అని, ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు.
వేంపల్లె, నవంబరు 11: బీజేపీ మోసకారి పార్టీ అని, ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వేంపల్లెలో నల్లజెండాలతో, నల్ల రిబ్బన్లతో నిరనసన చేపట్టింది. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఒక్కటే ఆంధ్రప్రదేశ్కు ఆత్మబంధువని, కాంగ్రె్సతోనే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధ్యమని, జోడోయాత్రలో రాహుల్ ఈ అంశాలపై స్పష్టత ఇచ్చారన్నారు.