పౌరులతో మర్యాదగా మెలగాలి

ABN , First Publish Date - 2022-08-25T06:27:21+05:30 IST

నగర సచివాలయాల్లో పౌర సేవల కోసం వచ్చేవారితో ఉద్యోగులంతా మర్యాదపూర్వకంగా ఉంటూ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా సూచించారు. వార్డు సచివాలయాల సెక్రటరీలు అర్హులందరికీ సంక్షేమ పఽథకాలు అమలు చేయడంలో, స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించి సేవలందించాలని అన్నారు.

పౌరులతో మర్యాదగా మెలగాలి
సచివాలలయ సిబ్బందితో మాట్లాడుతున్న జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా

జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా

మాధవధార, ఆగస్టు 24 : నగర సచివాలయాల్లో పౌర సేవల కోసం వచ్చేవారితో ఉద్యోగులంతా మర్యాదపూర్వకంగా ఉంటూ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా సూచించారు. వార్డు సచివాలయాల సెక్రటరీలు అర్హులందరికీ సంక్షేమ పఽథకాలు అమలు చేయడంలో, స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించి సేవలందించాలని అన్నారు. మురళీనగర్‌ బృందావన్‌ పార్కు దగ్గర గల వార్డు సచివాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు.  సచివాలయం రికార్డులు, ఉద్యోగుల హాజరు పరిశీలించారు. ప్రతి శుక్రవారం వార్డు పరిధి నివాసిత ప్రాంతాల్లో నీటి నిల్వల డ్రై డే కార్యక్రమం అమలు చేస్తున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. జోన్‌-5 జెడ్సీ ఆర్జీవీ కృష్ణ, ప్రజారోగ్య విభాగం ఏఎంహెచ్‌ఓ కె.రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-25T06:27:21+05:30 IST