పీఏసీ సభ్యులుగా బాలశౌరి, సీఎం రమేశ్
ABN , First Publish Date - 2022-11-25T03:54:21+05:30 IST
పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సబ్ కమిటీ సభ్యులుగా బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, వైసీపీ ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు...
న్యూఢిల్లీ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సబ్ కమిటీ సభ్యులుగా బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, వైసీపీ ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం గురువారం బులెటిన్ జారీ చేసింది. దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తులపై ఐజీఎ్సటీ తప్పుడు మినహాయింపు ఇవ్వడం, ఒప్పందం లేకుండా కాజువల్ లేబర్ను అక్రమంగా నియమించడంపై ఈ సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది.