ఏయూ విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-12-02T01:16:43+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంబీఏ విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరిపోసుకున్నాడు.
మద్దిలపాలెం, డిసెంబరు 1:
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంబీఏ విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరిపోసుకున్నాడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆంధ్ర విశ్వవిద్యాలయం డిప్యూటీ రిజిస్ర్టార్గా పనిచేస్తున్న పి.రత్నం కుటుంబం సిరిపురం ప్రాంతంలో గల వర్సిటీ క్వార్టర్స్లో నివాసం ఉంటుంది. ఆమె భర్త ఢిల్లీశ్వరరావు నౌకాదళంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరికి ముగ్గురు సంతానం. ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు (వీరు కవలలు). మూడేళ్ల కిందట కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. పెద్ద కుమారుడు మాధవ్ ఏయూలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల రెండో కుమారుడికి ఉద్యోగం వచ్చింది. ఇదిలావుండగా రత్నం అస్వస్థతకు గురయ్యారు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడం, తన సోదరుడికి ఉద్యోగం వచ్చి...తనకు రావడంతో మాధవ్ మనోవేదన చెందుతుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఫ్యాన్కు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లిన ఢిల్లీశ్వరరావు ఇంటికి వచ్చి...అక్కడ కనిపించిన దృశ్యం చూసి భోరుమన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాధవ్ మృతదేహాన్ని పోస్టుమార్టంం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.