చెరకు రైతులు, కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-02-16T05:32:01+05:30 IST
ఏటికొప్పాక చక్కెర కర్మాగారానికి గత సీజన్లో చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.4 కోట్లు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు రూ.7.5 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఏపీ రైతు సంఘం కార్యదర్శి ప్రసాద్ డిమాండ్
ఎస్.రాయవరం, ఫిబ్రవరి 15: ఏటికొప్పాక చక్కెర కర్మాగారానికి గత సీజన్లో చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.4 కోట్లు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు రూ.7.5 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం షుగర్ ఫ్యాక్టరీ గేటు వద్ద రైతులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నదని, దీంతో రైతులు, కార్మికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతరం ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం ప్రతినిధులు అన్నం వెంకటరమణ, మేకా సత్యనారాయణ, గొలుగొండ నూకినాయుడు, కాసుబాబు, మాకిరెడ్డి రామునాయుడు, గురుబాబు, కార్మిక సంఘ ప్రతినిధులు నగరి అప్పారావు, దార పోలయ్య, కాట్రగడ్డ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.