విశాఖ-హైదరాబాద్ బుల్లెట్ రైలు ఇవ్వండి
ABN , First Publish Date - 2022-03-16T09:23:03+05:30 IST
విశాఖ-హైదరాబాద్ బుల్లెట్ రైలు ఇవ్వండి
న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్టణం-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును చేపట్టాలని వైసీపీ ఎంపీ భీశెట్టి సత్యవతి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. లోక్సభలో మంగళవారం రైల్వే శాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విశాఖ-హైదరాబాద్ వయా విజయవాడ రైళ్లలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని, మరిన్ని ప్యాసింజర్ రైళ్లకు డిమాండ్ ఉందని చెప్పారు. కాగా, విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బుద్ధిస్ట్ సర్క్యూట్కు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాలని ప్రతిపాదించారు.