Vijayawada నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-17T17:56:26+05:30 IST
విజయవాడ నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది.
విజయవాడ: విజయవాడ నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. 134 అజెండా అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు. ప్రజలపై భారాలు తొలగించాలని సమావేశానికి ముందు టీడీపీ సభ్యులు ఆందోళన తెలిపారు. నగరంలో కుంటిసాకులు పేరుతో పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తివేసిన వాటిని పునరుద్ధరణ చేయానలి డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు బకాయిలు చెలించపోవడంతో పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు కౌన్సిల్ హాలులోకి మీడియాను అనుమతించేందుకు కార్పొరేషన్ అధికారులు నిరాకరించారు.