Durgamma temple: భక్తుల వివరాలు, ఆదాయం అంతా గోప్యం.. కొత్త సంస్కృతికి తెరదీసిన ఈవో

ABN , First Publish Date - 2022-09-28T17:31:57+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి అధికారులు కొత్త సంస్కృతికి తెరదీశారు.

Durgamma temple: భక్తుల వివరాలు, ఆదాయం అంతా గోప్యం.. కొత్త సంస్కృతికి తెరదీసిన ఈవో

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి అధికారులు కొత్త సంస్కృతికి తెరదీశారు. దసరా ఉత్సవాలలో ప్రతీరోజు దుర్గమ్మను ఎంత మంది భక్తులు దర్శించుకున్నారు, టికెట్ల ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ప్రతి ఉత్సవాల్లో సాయంత్రం భక్తుల దర్శన, ఆదాయ వివరాలు వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం ఉత్సవాలు ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నా భక్తుల దర్శనాలు, ఆదాయ వివరాలను దుర్గగుడి ఈఓ బ్రమరాంభ ఇంకా వెల్లడించలేదు. దీంతో దుర్గగుడి ఈఓ తీరుపై భక్తులు, పలువురు ఆలయ సిబ్బంది మండిపడుతున్నారు. 

Updated Date - 2022-09-28T17:31:57+05:30 IST