Durgamma temple: ‘మాకు సమాధానం చెప్పేవారే లేరా’ అంటూ దుర్గగుడిలో భక్తుడి ఆగ్రహం
ABN , First Publish Date - 2022-09-27T15:13:11+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు... అక్కడి ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు(Sherannavaratri celebrations) సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు... అక్కడి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 రూపాయల టికెట్ కొనుక్కున్న భక్తులను 300 రూపాయల క్యూలైన్లలో పంపడంపై మండిపడ్డారు. తమకు సమాధానం చెప్పేవారు లేరంటూ భక్తుడు ప్రశ్నించాడు. ‘‘స్తోమత లేకపోయినా భార్య నడవలేని పరిస్థితిలో ఉండడం వల్ల 500 రూపాయలు టికెట్ కొన్నాను. 500 రూపాయలు టికెట్ వీవీఐపీ అన్నారు. తీరా చూస్తే ఆర్డిఓ ఆఫీసర్ మమ్మల్ని ఆపేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అధికారులకు సరైంది కాదు. సరైన సమాధానం చెప్పే పోలీసాఫీసర్ గానీ, అధికారులు గానీ ఈ ఆలయంలో ఎక్కడా లేరు. ఎవరికి వారు వారి వారి సొంత మనుషులను దర్శనం చేయించే పనిలో పడ్డారు. మరి సామాన్య భక్తులకు, టికెట్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళకి ఇన్ని తిప్పలు పెడతారా’’ అంటూ భక్తుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.