AP News: ఇంద్రకీలాద్రిపై భక్తుడికి తీవ్ర అస్వస్థత... ఆస్పత్రికి తరలిస్తుండగా

ABN , First Publish Date - 2022-09-30T17:34:59+05:30 IST

ఇంద్రకీలాద్రిపై ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

AP News: ఇంద్రకీలాద్రిపై భక్తుడికి తీవ్ర అస్వస్థత... ఆస్పత్రికి తరలిస్తుండగా

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఫిట్స్‌ వచ్చి పడిపోయాడు. సుమారు 45 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి రూ.500 రూపాయల క్యూ లైన్ మార్గంలో దర్శనానికి వచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దుర్గమ్మ దర్శనానికి క్యూ లైన్ మార్గంలో వేచి ఉండగా ఫిట్స్ వచ్చి పడిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వెంటనే అతనికి సపర్యలు చేశారు. ఆపై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భక్తుడు చనిపోయాడు. భక్తుడు హైదరాబాద్‌‌కు చెందిన మూర్తిగా గుర్తించారు. 


Updated Date - 2022-09-30T17:34:59+05:30 IST