Vijayawada: వ్యాపారవేత్త అస్లాంది హత్యే
ABN , First Publish Date - 2022-09-26T03:12:50+05:30 IST
వ్యాపారవేత్త అస్లాంది హత్యేనని నిర్ధారణ అయింది. మొదటి భార్య, ఆమె ప్రియుడు వైసీపీ నేత అన్వర్ కలిసి చంపినట్లుగా...
విజయవాడ: వ్యాపారవేత్త అస్లాంది హత్యేనని నిర్ధారణ అయింది. మొదటి భార్య, ఆమె ప్రియుడు వైసీపీ నేత అన్వర్ కలిసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. అస్లాంను చంపి సహజ మరణంగా చిత్రీకరించారు. అయితే అస్లాం రెండో భార్య ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రియుడితో కలిసి భార్యే భర్త గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. పోస్ట్ మార్టం నివేదిక కోసం రెండో భార్య హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు తీవ్రంగానే స్పందించడంతో నివేదిక బయటకి వచ్చింది. అస్లాం హత్య తర్వాత అన్వర్ కనిపించకుండా పోయాడు. పోస్టుమార్టంలో కొన్ని నమూనాలను తీసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపారు. అస్లాం మృతదేహం బాగా చెడిపోవడంతో ఆధారాలు లభించలేదని ఎఫ్ఎస్ఎల్ అధికారులు చెప్పారు.
అయితే టాస్క్ ఫోర్స్ అధికారుల విచారణలో ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు భార్య అంగీకరించింది. నిందితులను కోర్టులో హాజరు పర్చడంతో రిమాండ్ విధించింది. వైసీపీ నాయకుల ఒత్తిడితో కేసు వివరాలను పోలీసులు వెల్లడించలేదు. హత్య అనంతరం నిందితుడు అన్వర్ను తప్పించేలా అధికారులు సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.