ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరపాలని కోరాం: విజయసాయి
ABN , First Publish Date - 2022-07-17T23:27:44+05:30 IST
అఖిలపక్ష సమావేశంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విజయసాయి మాట్లాడారు.
ఢిల్లీ: అఖిలపక్ష సమావేశంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విజయసాయి మాట్లాడారు. జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ఏపీలో వరద పరిస్థితులపై పార్లమెంట్లో చర్చించి ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు. అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరపాలని కోరామన్నారు.