TTD: శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2022-09-05T02:46:50+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామి (Venkateswara Swamy)ని ఆదివారం ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.

TTD: శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ న్యాయమూర్తులు

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి (Venkateswara Swamy)ని ఆదివారం ఏపీ, తెలంగాణ  హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వెంకటరమణ, జస్టిస్‌ కృపాసాగర్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నగేష్‌ భీమపాక, రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌కుమార్‌ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తులకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-09-05T02:46:50+05:30 IST