ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్ధి చిన్ని కుమారి
ABN , First Publish Date - 2022-10-08T09:20:20+05:30 IST
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్ధి చిన్ని కుమారి
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గాడు చిన్నికుమారి లక్ష్మి పేరును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గాడు చిన్నికుమారి లక్ష్మి ప్రస్తుతం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 2వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. 2008-10లో భీమిలి మున్సిపల్ చైర్పర్సన్గా వ్యవహరించిన చిన్నికుమారి లక్ష్మి.. రాష్ట్ర తెలుగు మహిళా విభాగంలో పని చేశారు. నాగవంశీయుల(బీసీ) వర్గానికి చెందిన చిన్నికుమారి భర్త అప్పల నాయుడు 1986నుంచి టీడీపీలో ఉన్నారు. విశాఖ జిల్లా టీడీపీలో వివిధ పదవులు నిర్వహించారు.