TTD: శ్రీవారి ఆలయంలో 20న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ABN , First Publish Date - 2022-08-29T01:15:44+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 20వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఆలయ శుద్ధి) కార్యక్రమం జరగనుంది.

TTD: శ్రీవారి ఆలయంలో 20న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 20వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఆలయ శుద్ధి) కార్యక్రమం జరగనుంది. సాధారణంగా ఏడాదిలో నాలుగు సార్లు తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల ముందు నిర్వహిస్తారు. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీవరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో 20న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. సెప్టెంబరులో ఒకటో తేదీన రుషి పంచమి, 6, 21న సర్వఏకాదశి, 7న వామన జయంతి, 9న అనంత పద్మనాభ వ్రతం, 11న మహాలయ పక్ష ప్రారంభం, 13న బృహత్యుమా వ్రతం, 25న మహాలయ అమావాస్య, 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Updated Date - 2022-08-29T01:15:44+05:30 IST