TTD: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-09-11T01:52:15+05:30 IST

తిరుమలలో శనివారం వారాంతపు రద్దీ నెలకొంది. రెండో శనివారంతోపాటు ఆదివారం వరస సెలవులు రావడంతో ఉదయం నుంచే కొండపై

TTD: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో శనివారం వారాంతపు రద్దీ నెలకొంది. రెండో శనివారంతోపాటు ఆదివారం వరస సెలవులు రావడంతో ఉదయం నుంచే కొండపై రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంలోపాటు లడ్డూకౌంటర్‌, అఖిలాండం, బస్టాండ్‌, అన్నప్రసాద భవనం వంటి ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. గదుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా భక్తులతో నిండిపోయాయి. శనివారం రాత్రి సమయానికి సర్వదర్శనం క్యూలైన్‌ లేపాక్షి, రాంభగీచ మీదుగా శ్రీవారిసేవా సదన్‌ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. వీరికి 24 గంటల తర్వాత  శ్రీవారి దర్శనం లభిస్తోంది.

Updated Date - 2022-09-11T01:52:15+05:30 IST