ఈనెల 25, నవంబరు 8న 12 గంటల పాటు శ్రీవారి సేవల రద్దు
ABN , First Publish Date - 2022-10-12T08:52:26+05:30 IST
ఈనెల 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం సందర్భంగా ఆ రెండురోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు 12 గంటల పాటు మూసివేస్తారు. 25న మంగళవారం సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల
సర్వదర్శన భక్తులకు మాత్రమే అనుమతి
గ్రహణాల కారణంగా టీటీడీ నిర్ణయం
తిరుమల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఈనెల 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం సందర్భంగా ఆ రెండురోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు 12 గంటల పాటు మూసివేస్తారు. 25న మంగళవారం సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. నవంబరు 8న మంగళవారం మఽధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఆ రోజు ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆయా రోజుల్లో ప్రత్యేక దర్శనాలన్నీ రద్దుచేసి సర్వదర్శన భక్తులను మాత్రమే అనుమతిస్తారు.