ఈనెల 25, నవంబరు 8న 12 గంటల పాటు శ్రీవారి సేవల రద్దు

ABN , First Publish Date - 2022-10-12T08:52:26+05:30 IST

ఈనెల 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం సందర్భంగా ఆ రెండురోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు 12 గంటల పాటు మూసివేస్తారు. 25న మంగళవారం సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల

ఈనెల 25, నవంబరు 8న 12 గంటల పాటు శ్రీవారి సేవల రద్దు

సర్వదర్శన భక్తులకు మాత్రమే అనుమతి

గ్రహణాల కారణంగా టీటీడీ నిర్ణయం


తిరుమల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఈనెల 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం సందర్భంగా ఆ రెండురోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు 12 గంటల పాటు మూసివేస్తారు. 25న మంగళవారం సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.  నవంబరు 8న మంగళవారం మఽధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఆ రోజు ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేస్తారు. ఆయా రోజుల్లో ప్రత్యేక దర్శనాలన్నీ రద్దుచేసి సర్వదర్శన భక్తులను మాత్రమే అనుమతిస్తారు.

Updated Date - 2022-10-12T08:52:26+05:30 IST