‘వన్‌ స్టేషన్‌-వన్‌ ప్రొడక్ట్‌’కు తిరుపతి రైల్వేస్టేషన్‌

ABN , First Publish Date - 2022-03-16T09:09:57+05:30 IST

కేంద్రం ప్రకటించిన ‘వన్‌ స్టేషన్‌-వన్‌ ప్రొడక్ట్‌’ విధానానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తిరుపతి రైల్వే స్టేషన్‌ ఎంపికైంది. స్థానికంగా కళాకారులు రూపొందించే హస్త

‘వన్‌ స్టేషన్‌-వన్‌ ప్రొడక్ట్‌’కు తిరుపతి రైల్వేస్టేషన్‌

పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక.. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం


హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రకటించిన ‘వన్‌ స్టేషన్‌-వన్‌ ప్రొడక్ట్‌’ విధానానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తిరుపతి రైల్వే స్టేషన్‌ ఎంపికైంది. స్థానికంగా కళాకారులు రూపొందించే హస్త కళాఖండాలు, వివిధ రకాల ఆహార ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకునేందుకు రైల్వేశాఖ రైల్వేస్టేషన్‌లో నామమాత్రపు ఫీజు రూ.500తో ప్రత్యేక స్టాల్‌ను కేటాయించి ప్రోత్సహించేందుకు ‘వన్‌ స్టేషన్‌-వన్‌ ప్రొడక్ట్‌’ విధానాన్ని రూపొందించింది. ఈ మేరకు మార్చి 25 నుంచి 15 రోజుల పాటు స్థానిక కళాకారులు తమ ఉత్పత్తులను రైల్వేస్టేషన్‌లో కేటాయించే స్టాల్‌ ద్వారా విక్రయించి ఉపాధి పొందవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.  ఆసక్తి గల అభ్యర్థులు, వస్తు తయరీదారులు, సంస్థలు స్టాల్‌ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిశోర్‌ సూచించారు.

Updated Date - 2022-03-16T09:09:57+05:30 IST