సింహ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి

ABN , First Publish Date - 2022-09-29T14:01:58+05:30 IST

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. నేడు సింహ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగనున్నారు.

సింహ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. నేడు సింహ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగనున్నారు. ఉదయం 8 గంటలకు సింహ వాహన సేవ ప్రారంభం కానుంది. నేడు వృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. అక్టోబరుకు సంబంధించి ఉచిత దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఉచిత దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అక్టోబరు 1 నుంచి 5 వరకు మినహా.. మిగిలిన రోజుల టికెట్ల బుకింగ్‌కు వీలు కల్పించనుంది. 

Updated Date - 2022-09-29T14:01:58+05:30 IST