తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-09-26T14:29:13+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి దర్శనం కోసం 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి దర్శనం కోసం 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని 69,650 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 20,409 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 

Updated Date - 2022-09-26T14:29:13+05:30 IST