తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-08-09T13:56:39+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి..
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి.. వెలుపల క్యూ లైనులో వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 74,830 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పించిన 39,405 మంది భక్తులు….హుండి ఆదాయం 4.79 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.