తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-11-18T08:59:38+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 65.062 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు స్వామివారికి 25,761 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2022-11-18T08:59:39+05:30 IST