వేదోక్తంగా హిందూ మతంలోకి..!
ABN , First Publish Date - 2022-10-05T08:09:04+05:30 IST
వేదోక్తంగా హిందూ మతంలోకి..!
హిందూ మతం స్వీకరించిన ఇద్దరు అమెరికన్లు
ఏర్పేడు, అక్టోబరు 4: పుట్టుకతో క్రైస్తవులైన ఇద్దరు అమెరికన్లు వేదోక్తంగా హిందూ మతాన్ని స్వీకరించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం ఇందుకు వేదికైంది. అమెరికాకు చెందిన డేవిడ్ సన్, అలెక్స్, భారత దేశంలో వేదాల ఆవిర్భావంపై కొన్నాళ్లుగా పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూధర్మం అత్యంత సనాతనమైనదిగా తెలుసుకుని ఆకర్షితులయ్యారు. హైదరాబాద్కు చెందిన రఘు అనే వ్యక్తి సహకారంతో.. అతి పురాతన ఆలయమైన గుడిమల్లంలోని పరశురామేశ్వరుడి ఆలయానికి మంగళవారం వచ్చారు. ముందుగా ఐదుగురు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వారికి శివ గోత్రాన్ని సార్థకం చేయడంతో హిందూమతాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయంలో మూలమూర్తికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పరశురామేశ్వర హోమంలో పాల్గొని అగ్నిహోత్రం ద్వారా దేవతలకు హవిస్సులు సమర్పించారు. ఆలయ చైర్మన్ నరసింహ యాదవ్, ఈవో రామచంద్రారెడ్డి, సర్పంచ్ సుబ్రమణ్యం యాదవ్, అధికసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.