Amaravati farmers పాదయాత్రకు ఐదు లక్షల విరాళం ఇచ్చిన టీడీపీ నేత
ABN , First Publish Date - 2022-09-24T16:24:56+05:30 IST
అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ నేత పిన్నమనేని బాబ్జీ ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.
విజయవాడ: అమరావతి రైతుల పాదయాత్ర (Amaravati farmers padayatra)కు టీడీపీ నేత పిన్నమనేని బాబ్జీ (Pinnamaneni babji)ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. గుడ్లవల్లేరు వద్ద రైతుల యాత్రకు స్వాగతం పలికిని బాబ్జీ ఆపై... చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత (TDP Leader) మాట్లాడుతూ... రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఉద్యమంలో న్యాయం ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) మాయ మాటలతో నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. అధికారం కోసం ఒక విధంగా, కుర్చీ ఎక్కాక రివర్స్ పాలన చేస్తున్నారన్నారు. రైతుల పాదయాత్రకు సంఘీభావంగా వచ్చే వారిని అడ్డుకోవడం దుర్మార్గమని విరుచుకుపడ్డారు. పాదయాత్రలో మహిళలు, వృద్ధులను చూసి ఆవేదన కలుగుతోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మంత్రులు బూతులు తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జగన్ మోసాలు అర్దం అయ్యాయని... సమయం చూసి బుద్ధి చెప్పడం ఖాయమని బాబ్జీ స్పష్టం చేశారు.