Tirupati town bank Electionsలో అక్రమాలపై కలెక్టర్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-07-20T19:32:54+05:30 IST

తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

Tirupati town bank Electionsలో అక్రమాలపై కలెక్టర్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) లేఖ రాశారు. 12 డైరెక్టర్ పోస్టులకు ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో అక్రమాలు, దొంగ ఓట్ల కారణంగా పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 


లేఖలోని అంశాలివే...

* తిరుపతి టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో పోలీసులతో కుమ్మక్కైన అధికార వైఎస్సార్సీపీ అక్రమాలకు పాల్పడింది.

వైఎస్సార్సీపీయేతర అభ్యర్థులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. 

పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు పోటీలో ఉన్న పులిగోరు మురళీ కృష్ణా రెడ్డి, బుల్లెట్ రమణ,జెబి శ్రీనివాసులుపై కేసులుపెట్టారు.

వైఎస్సార్సీపీ మద్దతు ఉన్న అభ్యర్థులకు అనుకూలంగా నకిలీ ఐడీ కార్డ్‌లతో దొంగ ఓట్లు వేయించారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న దళిత వర్గానికి చెందిన పి వలముని అనే పోటీదారుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం విస్మయకరం.

350 కోట్ల వార్షిక టర్నోవర్ తో 290 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్న బ్యాంక్ పై వైసిపి నేతల కన్ను పడింది.

బ్యాంకు సభ్యుల హక్కులను కాపాడేందుకు ఈరోజు పోలింగ్ ప్రక్రియను రద్దు చేయాలి.

నిష్పక్షపాతంగా మరో రోజు ఎన్నికలు నిర్వహించాలి అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-20T19:32:54+05:30 IST