AP News: విజయవాడలో బాలుడు అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2022-10-11T17:33:06+05:30 IST
నగరంలోని వాంబే కాలనీలో పన్నెండేళ్ల బాలుడు అనుమనస్పదస్థితిలో మృతి చెందాడు.
విజయవాడ: నగరంలోని వాంబే కాలనీలో పన్నెండేళ్ల బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతుడు చాట్ల చక్రవర్తి కుమారుడు శశాంక్గా పోలీసులు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న బాలుడికి తండ్రి మందులు వేసి పడుకోబెట్టాడు. ఉదయం లేచి చూసే సరికి బాలుడు ఇంటి ముందు నేలపై పడి బలమైన గాయంతో మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.