Ananthapuram : వివాదాలకు కేంద్రం ఎస్ఎస్బీఎన్ కళాశాల
ABN , First Publish Date - 2022-01-03T15:34:16+05:30 IST
అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల వివాదాలకు కేంద్రంగా మారింది. 2010 - 2017 ఫీజు రీయింబర్స్మెంట్లో
అనంతపురం : అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల వివాదాలకు కేంద్రంగా మారింది. 2010 - 2017 ఫీజు రీయింబర్స్మెంట్లో భారీగా నిధుల గోల్ మాల్ జరిగింది. రూ.30 లక్షల నుంచి 40 లక్షల వరకు పక్కదారి పట్టాయి. కోటి రూపాయల వరకూ రూసా నిధులకు గండి పడింది. ఎలాంటి టెండర్లు లేకుండానే బినామీలతో యాజమాన్యం పనులు చేపట్టింది. ఆడిట్ రిపోర్టులో ఆర్థిక అవకతవకలు బట్టబయలయ్యాయి. రేపు జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ విచారణ జరిగింది.