టీడీపీ విజయానికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-12-06T23:50:27+05:30 IST
వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీ విజయానికి సమ ష్టిగా కృషి చేయాలని చంద్ర బాబునాయుడు దిశా నిర్దేశం చేశారని పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి (బాబ్జీ) తెలిపారు.
ఎచ్చెర్ల, డిసెంబరు 6: వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీ విజయానికి సమ ష్టిగా కృషి చేయాలని చంద్ర బాబునాయుడు దిశా నిర్దేశం చేశారని పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి (బాబ్జీ) తెలిపారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు ఢిల్లీలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో మంగ ళవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుతో ఆయన్ను కలిసినట్టు చెప్పారు. పార్టీ కష్టకాలంలో జిల్లా అధ్యక్ష పదవిని సమర్థవంతంగా నిర్వహిం చారని, ఇదే స్ఫూర్తితో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంకిత భావంతో పనిచేయాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పిం చనున్నట్టు హామీ ఇచ్చారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబును సీఎంను చేసేందుకు గ్రామగ్రామాన పర్యటించనున్నట్టు చె ప్పారు. టీడీపీ విజయంతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు.