సమగ్ర భూసర్వేను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-04-25T05:06:14+05:30 IST

స మగ్ర భూసర్వేను రైతులు వినియో గించుకోవాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరా రు.

సమగ్ర భూసర్వేను వినియోగించుకోవాలి
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ధర్మాన:

  రెవెన్యూ శాఖ మంత్రి ప్రసాదరావు

శ్రీకాకుళం,ఆంధ్ర జ్యోతి, ఏప్రిల్‌ 24: స మగ్ర భూసర్వేను రైతులు వినియో గించుకోవాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరా రు. శ్రీకాకుళం రూరల్‌ మండలం నైర గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయా న్ని, టైప్‌-2 భవనాన్ని, పొన్నాంలో రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన  సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వ హించిన సభలో మంత్రి  మాట్లాడుతూ.. రికార్డుల్లో పేర్లను సరిచూసుకునే క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్వే సమగ్రంగా పూర్తయితే చాలా వరకూ భూ వివాదాలు ఓ కొలిక్కి వస్తాయన్నారు. వేసవిలో కూడా పంటల సాగుకు ఏ ఇబ్బందీ లేకుండా వంశధార నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, ఎంపీపీ అంబటి నిర్మలా శ్రీనివాస్‌, జడ్పీటీసీ రుప్ప దివ్య, ఎంపీడీవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 




 


Updated Date - 2022-04-25T05:06:14+05:30 IST