నేడు శ్రీరామనవమి
ABN , First Publish Date - 2022-04-10T05:49:41+05:30 IST
శ్రీరామనవమి ఉత్సవాలకు జిల్లాలో ఆలయాలు ముస్తాబయ్యాయి. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఆదివారం నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
నువ్వలరేవులో వారం రోజులపాటు ఉత్సవాలు
వజ్రపుకొత్తూరు,
ఏప్రిల్ 9 : శ్రీరామనవమి ఉత్సవాలకు జిల్లాలో ఆలయాలు ముస్తాబయ్యాయి.
వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఆదివారం నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలు
నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశామని గ్రామపెద్ద బెహరాలు
తెలిపారు. ఆలయాలు, వీధులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రామంలోని
సీతారామాలయం వద్ద జెండాను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలను
తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఒడిశా నుంచి కూడా వస్తుంటారు.
వారంరోజులపాటు రాత్రివేళల్లో సాగే యాత్ర, రామకీర్తన గ్రామంలో ప్రత్యేక
ఆకర్షణగా నిలుస్తుంది. కాగా మూడురోజులపాటు గ్రామదేవత ఉత్సవాలను ఘనంగా
నిర్వహించారు.